by Suryaa Desk | Tue, Jul 02, 2024, 05:46 PM
పిఠాపురం నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకుంటానని పవన్ తెలిపారు. నియోజకవర్గంలో స్థలం కోసం చూస్తున్నానని, సొంత ఇంటిని కట్టుకుంటానని ప్రకటించారు. మీ అందరి మధ్యే ఉంటానని చెప్పారు. అంతకుముందు వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరు సగిల షాన్మోహన్, ఎస్పీ సతీష్కుమార్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన, బీజేపీ ఇన్చార్జి మరెడ్రి శ్రీనివాసరావు, బుర్రా కృష్ణంరాజు పాల్గొన్నారు.
Latest News