పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి
 

by Suryaa Desk | Tue, Mar 25, 2025, 02:01 PM

ఒకవైపు ఏపీకి తీరని అన్యాయం జరుగుతుంటే.. మరోవైపు ఏ ఒక్క అంశంపైనా టీడీపీ ఎంపీలు నోరు విప్పడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అయితే.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఫైనాన్స్‌ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో  లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు.  ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం. దాదాపు 194 టీఎంసీల కెపాసిటీతో దీనిని డిజైన్ చేశారు. కానీ, ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 115 టీఎంసీలకు పడిపోతుంది. అలాగే.. రూ.60 వేల కోట్ల వ్యయం అవుతుండగా కేవలం 30 వేల కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతోంది. పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోవడం అన్యాయం అని అన్నారు. 

Latest News
Novelty of Rashid Khan has worn off a little, not as intimidating as before, says Kumble ahead of IPL 2026 Sun, Dec 28, 2025, 06:28 PM
Gujarat adding more than 7,000 doctors every year: CM Bhupendra Patel Sun, Dec 28, 2025, 06:27 PM
Meta-owned Instagram hit by brief outage, users report login and app issues Sun, Dec 28, 2025, 05:51 PM
India's youth must lead age of artificial intelligence: Gautam Adani Sun, Dec 28, 2025, 05:48 PM
Ratan Tata reshaped Indian enterprise with integrity: HM Amit Shah Sun, Dec 28, 2025, 05:42 PM