|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 02:52 PM
దేశంలో భర్తలను భార్యలు దారుణంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. యూపీ ఘటనలు మరవక ముందే కర్ణాకటలో మరో దారుణం వెలుగుచూసింది.
బెంగళూరులో తల్లి సాయంతో ఓ భార్య తనభర్తను గొంతుకోసి చంపేసింది. రెండేళ్లు సహజీవనం చేసి లోక్నాథ్ సింగ్ (37)ను ఓ మహిళ పెళ్లి చేసుకుంది. తర్వాత లోక్నాథ్ వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీలు తెలియడంతో అతడిని చంపినట్లు పోలీసులు గుర్తించారు.