లులూ గ్రూపు ఏర్పాటుకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
 

by Suryaa Desk | Thu, Mar 27, 2025, 10:41 AM

లులూ గ్రూపు ఏర్పాటుకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

విశాఖపట్నంలో ఇంటర్నేషనల్‌ షాపింగ్‌ మాల్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు లులూ గ్రూపు ముందుకు వచ్చింది. దీనిపై ఏపీఐఐసీకి ప్రతిపాదనలు సమర్పించింది. వాటిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీఎంఆర్‌డీఏ వద్ద ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి వెనక్కి ఇవ్వాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లులూ గ్రూపునకు కేటాయించిన భూములను వైసీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి వెనక్కి తీసుకుంది. ఆ స్థలాన్ని ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ పేరుతో నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌బీసీసీ) ద్వారా వేలం వేయాలని ప్రయత్నించింది. దానిపై విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ భూములు విక్రయించవద్దని కోర్టు స్టే ఇచ్చింది. దాంతో జగన్‌ ప్రభుత్వం ఆ భూములు వీఎంఆర్‌డీఏకు బదలాయించి, ఆ సంస్థతో వేలం వేయించి సొమ్ము చేసుకోవాలని చూసింది. ఇదంతా 2024 ప్రారంభంలో జరగడం, ఆ తరువాత ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆ భూములన్నీ వీఎంఆర్‌డీఏ వద్దనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని తిరిగి ఏపీఐఐసీకి వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Latest News
More relief, medical supplies: India continues humanitarian aid to Myanmar Tue, Apr 01, 2025, 04:12 PM
Vast potential of cooperation between India, Netherlands: MEA Tue, Apr 01, 2025, 04:11 PM
Wagner retires from NZ domestic cricket with Plunket Shield win Tue, Apr 01, 2025, 03:08 PM
Bandi Sanjay, KTR accuse Telangana government of destroying environment Tue, Apr 01, 2025, 02:57 PM
IPL 2025: Our goal is to win title and celebrate with fans in open-bus parade, says PBKS' Arshdeep Tue, Apr 01, 2025, 02:55 PM