![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 03:32 PM
పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలున్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఇది రోడ్డు ప్రమాదమని ప్రకటించారని, రోడ్డు ప్రమాదమా లేక హత్య అనేది తేల్చాల్సింది పోలీసులు అని తెలిపారు.
ఈ కేసును పారదర్శకంగా విచారణ జరపకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. వైద్యులు పోస్టుమార్టం నివేదికను నిష్పక్షపాతంగా ఇవ్వాలని, తేడా వస్తే రీ పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.