![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:27 PM
రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మంత్రి అచ్చెంనాయుడును శుక్రవారం రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
పులివెందుల నియోజకవర్గంలో నష్టపోయిన రైతులు గురించి మంత్రికి తెలియజేశారు. వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో వాటి కార్యాచరణపై చర్చించారు. మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.