‘టేక్‌ ఎ బ్రేక్‌ సెంటర్‌ కు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ
 

by Suryaa Desk | Fri, Mar 28, 2025, 08:25 PM

కేరళ  లోని వాయనాడ్‌ జిల్లా  లో పలు మహిళా సాధికారత ప్రాజెక్టుల  కు శుక్రవారం కాంగ్రెస్‌ ఎంపీ  ప్రియాంకాగాంధీ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు మహిళల నేతృత్వంలో పనిచేస్తాయని చెప్పారు. వాయనాడ్‌ జిల్లాలోని తన్విన్‌హాల్ గ్రామ పంచాయతీ  లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ.. ఇవాళ నేను ఆధునిక అంగన్‌వాడీ కేంద్రమైన ‘టేక్‌ ఎ బ్రేక్‌ సెంటర్‌’కు శంకుస్థాపన చేశానని, ఇది పర్యాటకులకు విశ్రాంతి కేంద్రంగా, వినోద కేంద్రంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ కేంద్రాన్ని మహిళా సంఘాల మహిళలు ఆపరేట్‌ చేస్తారని తెలిపారు. ఈ కేంద్రంలో కెఫటేరియా, పార్కు ఉన్నాయని, అవి కూడా మహిళల నేతృత్వంలోనే కొనసాగుతాయని అన్నారు. ఈ కేంద్రాన్ని మహిళలు నడుపడం అద్భుతంగా ఉంటుందని చెప్పారు.


 


పురుషులు తరచూ మహిళల శక్తిని తక్కువ అంచనా వేస్తుంటారని, కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేయగలమని గ్రామానికి చెందిన మహిళలను ఉద్దేశించి ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు. ఇంటిని, కుటుంబాన్ని మనం అద్భుతంగా నడుపుతున్నామని, మనం ఏ పనిచేసినా, అది కార్యాలయంలో అయినా, వ్యాపారంలో అయినా అంకితభావంతో చేస్తామని చెప్పారు. తన్విహాల్ పంచాయతీ ఏరియా మంచి పర్యాటక ప్రాంతమని, ఈ ఏరియాలో సహజ అందాలు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి ఏరియాలో మహిళకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.


 


 

Latest News
Bihar CM Nitish Kumar meets PM Modi in Delhi; discuss development and political issues Mon, Dec 22, 2025, 04:51 PM
Suryakumar Yadav to play two Vijay Hazare Trophy matches in Jan 2026 Mon, Dec 22, 2025, 04:45 PM
Coupang daily user count slips to 14 million range after data breach Mon, Dec 22, 2025, 04:43 PM
Rajnath Singh steers MoU between DRDO, Raksha University for R&D Mon, Dec 22, 2025, 04:42 PM
MP CM Mohan Yadav meets BJP Working President Nitin Nabin in Delhi Mon, Dec 22, 2025, 04:36 PM