![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 08:41 PM
విశాఖ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన యువకుడు, సింహాచలం ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం తమ స్నేహితుడి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Latest News