విజయవాడలో ఆ 3 గంటలు ఏం జరిగింది..పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు
 

by Suryaa Desk | Sat, Mar 29, 2025, 05:48 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం రాజమండ్రి శివారు ప్రాంతంలో రోడ్డు పక్కన కనిపించిన సంగతి తెలిసిందే. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయమై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. ఘటన జరిగిన రోజు పరిణామాలను వివరించారు.


ఐజీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి చౌటుప్పల్ టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత విజయవాడకు చేరుకున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల.. విజయవాడలో 3 నుంచి 4 గంటల పాటు ఉన్నారని ఏలూరు ఐజీ తెలిపారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరిని కలిశారు? ఏం చేశారు? అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఐజీ అశోక్ కుమార్ వివరించారు. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11 గంటల 40 నిమిషాలకు చేరుకున్నట్లు ఐజీ తెలిపారు.


మరోవైపు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ పోలీసులు.. మొత్తం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నంచి రాజమండ్రి వరకు ప్రయాణించిన 15 గంటల సీసీ ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఎవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో ఫోరెన్సిక్‌, పెథాలజీ సహకారం కూడా తీసుకుంటున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్, మొబైల్‌ డేటా సైతం సేకరిస్తున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఐజీ అశోక్‌కుమార్‌ హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, డీజీపీలు ఈ కేసుపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని తెలిపారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల టోల్ ప్లాజాల వద్ద ఉన్న సీసీ పుటేజ్‌లను పోలీసులు విడుదల చేశారు.

Latest News
'Bengal won't accept such politics': BJP on Amit Shah's infiltration charge against Mamata govt Tue, Dec 30, 2025, 04:10 PM
IANS Year Ender 2025: Maharashtra sees political consolidation, growth push amid fiscal pressure Tue, Dec 30, 2025, 03:29 PM
IOA to convene National Athletes' Forum on Jan 10 in Ahmedabad Tue, Dec 30, 2025, 03:24 PM
Archer named in England's provisional squad for T20 World Cup Tue, Dec 30, 2025, 03:22 PM
TN emerges as top-performing state with 11.19 pc growth: Udhayanidhi Stalin Tue, Dec 30, 2025, 03:20 PM