ముందు రూ.4 లక్షలు కట్టి.. అపై పార్లమెంట్‌కు వెళ్లండి..: జైల్లో ఉన్న ఎంపీ రషీద్‌కు హైకోర్టు ఆదేశం
 

by Suryaa Desk | Sat, Mar 29, 2025, 07:38 PM

ఉగ్రవాద నిధుల మళ్లింపు కేసులో భాగంగా అరెస్ట్ అయి, ప్రస్తుతం జైల్లో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న జమ్ము కశ్మీర్ ఎంపీ రషీద్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవలే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా రెండ్రోజుల క్రితమే కోర్టు ఓకే చెప్పింది. ఈక్రమంలోనే ఆయన శుక్రవారం రోజు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. కానీ తాజాగా ముందు 4 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని.. ఆ తర్వాతే పార్లమెంట్ సమావేశాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం డబ్బులు ఎందుకు చెల్లించాలని కోరిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఇంజినీర్ రషీద్‌గా ప్రసిద్ధి చెందిన అబ్ధుల్ రషీద్ షేక్ బారామూల్లా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే 2017లో ఉగ్రవాదానికి నిధులు సుమకూర్చారనే ఆరోపణలతో ఎన్ఐఏ ఎంపీ రషీద్‌ను అరెస్ట్ చేసింది. ముఖ్యంగా రషీద్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఉగ్రవాదులతో కలిసి ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నారని.. కశ్మీర్ లోయలో అల్లకల్లోలం రేకెత్తిస్తున్నారని ఆరోపించింది. ఈక్రమంలోనే సదరు ఎంపీకీ కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. ఈక్రమంలోనే ఆయన 2019 నుంచి తిహాడ్ జైల్లోనే శిక్షను అనుభవిస్తున్నారు.


అయితే ఇటీవలే ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరు అయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కోరారు. విచారణ జరిపిన న్యాయస్థానం రెండ్రోజుల క్రితమే అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని షరతులు కూడా విధించింది. పోలీస్ కస్టడీలో మాత్రమే వెళ్లాలని.. నిర్ణీత సమయంలోనే పాల్గొని తిరిగి జైలుకు రావాలని వివిరించింది. అలాగే అక్కడ ఎవరితోనూ మాట్లడకూడదని.. సెల్‌ఫోన్, ల్యాండ్ లైన్ వంటివి వాడడానికి వీళ్లేదని తేల్చి చెప్పింది. అలాగే ప్రయాణ ఖర్చులను సైతం ఎంపీయే భరించాలని పేర్కొంది.


అయితే శుక్రవారం రోజు ఎంపీ రషీద్ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. అయితే ప్రయాణ ఖర్చుల కింద రూ.8.7 లక్షలను.. జైలు అధికారులకు చెల్లించాలని కోర్టు చెప్పింది. కానీ అంత మొత్తంలో తాను చెల్లించలేనని ఎంపీ వివరించారు. జైలుశిక్ష అనుభవిస్తున్న తాను ఇంత ఎక్కువ ఖర్చును భరించలేనని.. తన రాజ్యాంగ విధులను నిర్వర్తించేందుకు ఇలా ఇబ్బంది పెట్టకూడదని కోరారు. ఆయన అభ్యర్థనను అర్థం చేసుకున్న న్యాయస్థానం ఇందులో 50 శాతం అయినా చెల్లించాలని చెప్పింది. ఇప్పటికే ఎంపీ రషీద్ రూ.1.4 లక్షలు చెల్లించారు. మరో మూడు జైలుశిక్ష పూర్తి మొత్తాన్ని డిపాజిట్ చేస్తామని రషీద్ తరఫు న్యాయవాది వెల్లడించారు.

Latest News
IANS Year Ender 2025: A year of strains, signals and slow repair for India–US partnership Wed, Dec 31, 2025, 04:47 PM
BJP ally TMP urges Centre to enact anti-racial law to protect Northeast people Wed, Dec 31, 2025, 04:46 PM
Kerala: CPI calls for course correction after local poll setback Wed, Dec 31, 2025, 04:41 PM
IANS Year Ender 2025: Key Supreme Court judgments of 2025 Wed, Dec 31, 2025, 04:40 PM
Assam saw significant improvement in crime detection, convictions in 2025: Top cop Wed, Dec 31, 2025, 04:34 PM