ప్రొఫెషనల్ టాక్స్ అంటే ఏంటి.. ఏ రాష్ట్రంలో ఎలా
 

by Suryaa Desk | Sat, Mar 29, 2025, 11:11 PM

కొన్ని వారాలుగా.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాల్లో ప్రొఫెషనల్ ట్యాక్స్ (వృత్తి పన్ను) నిబంధనలను మార్చాయి. అసోం ప్రభుత్వం నెలకు రూ. 15,000 వరకు ఆదాయం ఉన్న ఉద్యోగులకు వృత్తి పన్నును రద్దు చేసింది. దీనికి విరుద్ధంగా, కర్ణాటక ప్రభుత్వం వృత్తి పన్నును రూ. 150 నుంచి రూ. 200కు పెంచింది. అసలు ఈ ప్రొఫెషనల్ టాక్స్ అంటే ఏంటి.. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. వృత్తి పన్ను అనేది ఉద్యోగులు, వ్యాపారుల ఆదాయంపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంటుంది. అయితే, అన్ని రాష్ట్రాలు ఈ పన్నును విధించవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 276 ప్రకారం ఒక వ్యక్తిపై గరిష్టంగా రూ. 2,500 వరకు మాత్రమే వృత్తి పన్ను విధించవచ్చు.


ప్రొఫెషనల్ టాక్స్..


ఇది ఆదాయం ఆధారంగా వివిధ వృత్తులు, వ్యాపారాలు చేసే వ్యక్తులపై విధించే పన్ను. ఉద్యోగులు, వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, ప్రొఫెషనల్స్ నుంచి ఒక నిర్దిష్ట ఆదాయ స్థాయికి మించి సంపాదించే వారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పన్నును వసూలు చేస్తుంది.


రాష్ట్రాల వారీగా వృత్తి పన్ను వివరాలు:


ఆంధ్రప్రదేశ్: రూ. 15,001 నుంచి రూ. 20,000 మధ్య నెల ఆదాయం ఉన్నవారికి నెలకు రూ. 150 ప్రొఫెషనల్ టాక్స్ విధిస్తారు. రూ. 20,000 కంటే ఎక్కువ సంపాదించేవారు రూ. 200 చెల్లించాలి.


బిహార్: రాష్ట్ర ప్రభుత్వం వార్షికంగా రూ. 3 లక్షలకు పైన సంపాదించేవారికి రూ. 1,000 నుంచి రూ. 2,500 వరకు వృత్తి పన్ను విధిస్తుంది.


ఛత్తీస్‌గఢ్: సంవత్సరానికి రూ. 1,00,000 పైన ఆదాయం ఉంటే రూ. 130 నుంచి రూ. 210 వరకు వృత్తి పన్ను విధిస్తారు.


గుజరాత్: నెలకు రూ. 12,000 పైన ఆదాయం ఉంటే రూ. 200 వృత్తి పన్ను విధిస్తారు.


జార్ఖండ్: సంవత్సరానికి రూ. 3 లక్షలకు పైన సంపాదించే వ్యక్తులపై రూ. 100 నుండి రూ. 208 వరకు వృత్తి పన్ను విధిస్తారు.


కర్ణాటక: నెలకు రూ. 25,000 పైన ఆదాయం ఉంటే రూ. 200 వృత్తి పన్ను విధిస్తారు.


కేరళ: రూ. 12,000 పైన అర్ధ సంవత్సర ఆదాయం ఉంటే రూ. 120 నుంచి రూ. 1,250 వరకు వృత్తి పన్ను విధిస్తారు.


మధ్యప్రదేశ్: నెలకు రూ. 18,750 పైన ఆదాయం ఉంటే రూ. 125 నుంచి రూ. 212 వరకు ప్రొఫెషనల్ టాక్స్ విధిస్తారు.


అసోం: నెలకు రూ. 15,000 వరకు ఆదాయం ఉన్న వారికి ప్రొఫెషనల్ టాక్స్ లేదు.


మహారాష్ట్ర: నెలకు రూ. 7,500 పైన ఆదాయం ఉంటే రూ. 175 నుంచి రూ. 300 వరకు ఈ టాక్స్ పడుతుంది. మహిళలకు రూ. 10,000 వరకు ఆదాయం ఉంటే పన్ను మినహాయింపు ఉంది.


మణిపూర్: సంవత్సరానికి రూ. 50,000 పైన ఆదాయం ఉంటే రూ. 1,200 నుంచి రూ. 2,500 వరకు పన్ను విధిస్తారు. మేఘాలయలో నెలకు రూ. 4,166, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే రూ. 16.5 నుంచి రూ. 208 వరకు వృత్తి పన్ను విధిస్తారు. మిజోరాంలో నెలకు రూ. 5,000 పైన ఆదాయం ఉంటే రూ. 75 నుంచి రూ. 208 వరకు ప్రొఫెషనల్ టాక్స్ పడుతుంది. నాగాలాండ్‌లో నెలకు రూ. 4 వేలపైన ఆదాయం ఉంటే రూ. 35 నుంచి రూ. 208 వరకు వృత్తి పన్ను విధిస్తారు.


ఒడిశా: రూ. 1,60,000 కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు నెలకు రూ. 125- రూ. 300 వరకు వృత్తి పన్ను చెల్లించాలి. పుదుచ్చేరిలో సంవత్సరానికి రూ. 1,00,000 పైన జీతం ఉంటే రూ. 250 నుంచి రూ. 1,250 వరకు పన్ను విధిస్తారు. పంజాబ్‌లో నెలకు రూ. 20,833 కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులపై రూ. 200 వృత్తి పన్ను విధిస్తారు. సిక్కింలో నెలకు రూ. 20,000 పైన ఆదాయం ఉంటే రూ. 125- 200 వరకు పన్ను విధిస్తారు.


తమిళనాడు: నెలకు రూ. 21,000 పైన ఆదాయం ఉంటే రూ. 100 నుంచి రూ. 1,095 వరకు ప్రొఫెషనల్ టాక్స్ విధిస్తారు.


తెలంగాణ: నెలకు రూ. 15,000 నుంచి రూ. 20,000 మధ్య సంపాదించేవారికి రూ. 150 వృత్తి పన్ను విధిస్తారు. రూ. 20,000 పైన సంపాదించేవారికి రూ. 200 విధిస్తారు.


త్రిపురలో నెలకు రూ. 7,500 నుంచి రూ. 15,000 మధ్య సంపాదించే వ్యక్తులు రూ. 150 వృత్తి పన్ను చెల్లించాలి. రూ. 15,000 కంటే ఎక్కువ సంపాదించేవారు రూ. 208 చెల్లించాలి. పశ్చిమ బెంగాల్‌లో రూ. 10,000 పైన ఆదాయం ఉంటే రూ. 110 నుంచి రూ. 200 వరకు టాక్స్ కట్టాలి.

Latest News
No better place than a full crowd of blue: Daryl Mitchell on NZ youngsters’ first cricket experience of India Sun, Jan 11, 2026, 06:30 PM
Amit Shah calls for BJP CM in Kerala, pushes big leap for party Sun, Jan 11, 2026, 06:27 PM
People of Punjab must reject politics of lies, says Haryana CM Sun, Jan 11, 2026, 06:25 PM
Pakistani police arrest Afghan journalist in Islamabad Sun, Jan 11, 2026, 05:31 PM
Pakistan needs to give fair taxation rights to states Sun, Jan 11, 2026, 05:30 PM