వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమానికి హాజరైన ప్రధాని
 

by Suryaa Desk | Sun, Mar 30, 2025, 10:37 AM

భారతదేశంలో అతిపెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ  నైన్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు  ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు.  ఈ సమ్మిట్ లో ప్రసంగించిన మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు  కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఆర్థిక పురోగతి ప్రయత్నాల గురించి వివరించారు. ప్రపంచ బ్యాంకు, IMF డేటా ప్రకారం, రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. పీఎం గతి శక్తి, స్టార్టప్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు వంటి కార్యక్రమాలు.. తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి వాటిలో మార్పునకు దారితీస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో చూపిస్తున్న చొరవ.. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఆదర్శంగా మారుతోందని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ రాము రావు అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం.. అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన అన్నారు. డిజిటల్ ఇండియా దార్శనికత దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక మార్గదర్శి పాత్రను పోషిస్తోందని పేర్కొన్నారు.

Latest News
Mobile land registration to facilitate people aged 80 and above in Bihar Tue, Jan 13, 2026, 04:41 PM
Global chip revenue touches $793 billion in 2025 led by AI semiconductors Tue, Jan 13, 2026, 04:40 PM
'MGNREGA Bachao Sangram' reaching 2.5 lakh gram panchayats: Congress Tue, Jan 13, 2026, 04:38 PM
Tatjana Maria tops Venus Williams in Hobart International opener Tue, Jan 13, 2026, 04:31 PM
Citizens, especially youth, should have basic understanding of AI: Ashwini Vaishnaw Tue, Jan 13, 2026, 04:28 PM