72 గంటల్లో రోడ్లపై గుంతలు పూడ్చండి.. మంత్రి కీలక ఆదేశాలు
 

by Suryaa Desk | Wed, Dec 03, 2025, 08:02 PM

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో మొదటి వరుసలో ఉన్న ఢిల్లీలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకరమైన స్థాయిని మించి.. నమోదు అవుతోంది. దీంతో ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో ఉన్న ప్రజలు.. గాలి పీల్చేందుకు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఢిల్లీలో కాలుష్యం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు సరికదా.. రోజురోజుకూ పెరుగుతోంది.


ఢిల్లీ , నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రేఖా గుప్తా ప్రభుత్వం కఠినమైన, తక్షణ చర్యలు ప్రకటించింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మంగళవారం కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఉద్దేశించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ప్రస్తుతం లెవెల్-2లో ఉన్న నేపథ్యంలో.. ఢిల్లీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని రోడ్లపై ఉన్న గుంతలన్నింటినీ 72 గంటల్లోగా పూడ్చాలని మంత్రి సిర్సా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు.


కాలుష్యానికి కారణమవుతున్న పారిశ్రామిక యూనిట్లు 20 రోజుల్లో కాలుష్య నిబంధనలను పాటించాలని.. లేదంటే వాటి కార్యకలాపాలను నిలిపివేసి.. జరిమానా విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలో నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి.. కాలుష్య నివారణకు సూచనలు తీసుకోనున్నారు. ఇతర కీలక నిర్ణయాల్లో బీఎస్-4 కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ట్రక్కులను ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో నడపడాన్ని నిషేధించారు. బీఎస్-2, బీఎస్-3 వాహనాలకు తప్పనిసరిగా పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) పరీక్ష చేయించుకోవాలని సూచించారు.


నిర్మాణ పనుల నుంచి వచ్చే ధూళిని నియంత్రించడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ 1000 వాక్యూమ్ ఆధారిత లిట్టర్ పిక్కర్స్‌ను 45 రోజుల్లో నియమించుకోవాలని సీఎం రేఖా గుప్తా ఆదేశించారు. కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తక్షణం అమలు చేయాల్సిన ముఖ్య నిర్ణయాలను ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ రోడ్లపై ఉన్న గుంతలన్నింటినీ 72 గంటలలోపు పూడ్చే బాధ్యతను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. కాలుష్యాన్ని పెంచుతున్న పారిశ్రామిక యూనిట్లు 20 రోజుల్లోపు కాలుష్య నిబంధనలు పాటించాలని.. లేదంటే వాటిని మూసివేసి, ఫైన్లు విధిస్తారు.


నిర్మాణాల ప్రాంతాల్లో దుమ్మును అణిచివేయడానికి ఎంసీడీ స్ర్పింక్లర్లను ఉపయోగిస్తుంది. ఫరీదాబాద్, గురుగ్రామ్, ఘజియాబాద్ వంటి ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో కూడా నీటి స్ర్పింక్లర్లను ఏర్పాటు చేస్తారు. దీర్ఘకాలికంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం గ్రీనరీపై దృష్టి సారించింది. ప్రజల భాగస్వామ్యంతో స్థానిక సంస్థలు మరిన్ని మొక్కలు నాటడంపై దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. ఖాళీగా ఉన్న అన్ని పార్కులను తనిఖీ చేసి.. వాటిలో పచ్చదనాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటారు.

Latest News
TN: AITUC-affiliated agricultural labourers’ body opposes renaming of MGNREGA Sat, Dec 13, 2025, 04:42 PM
SMAT: 'No matter what, you have to give your best,' says Reddy after picking hat-trick Sat, Dec 13, 2025, 04:30 PM
TN Police arrest YouTuber 'Savukku' Shankar after long standoff Sat, Dec 13, 2025, 04:29 PM
Digital opportunities opening up for youth under PM Modi: Delhi CM Sat, Dec 13, 2025, 04:25 PM
PM Modi hails BJP's Thiruvananthapuram breakthrough as watershed moment in Kerala politics Sat, Dec 13, 2025, 04:20 PM