ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
 

by Suryaa Desk | Wed, Dec 10, 2025, 09:03 PM

రాష్ట్రంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు 32 శాతం పెరిగాయని, రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో ఇప్పటివరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు తెలిపారు. రైతుల సౌకర్యార్థం ఈ కేంద్రాల్లో 7.89 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతులకు రూ.4,085 కోట్లు చెల్లించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. వేగంగా చెల్లింపులు జరపడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ ఏడాది మొత్తం 50.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు వ్యవసాయ, పౌరసరఫరాలు, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News
Govt not intimidated by Chomu violence, will continue action against encroachments: Giriraj Singh Sat, Dec 27, 2025, 01:18 PM
Is he above law: Bangladesh Awami League flags 'repeated privileges' given to BNP's Tarique Rahman Sat, Dec 27, 2025, 01:12 PM
Bangladesh polls: Student-led NCP drifts toward Jamaat amid internal rift over alliance formation Sat, Dec 27, 2025, 12:27 PM
Loan growth in India to be strong in Q3 FY26 with improved net interest margins Sat, Dec 27, 2025, 12:22 PM
Four of family die from toxic fumes in Bihar's Chhapra, three critical Sat, Dec 27, 2025, 12:16 PM