|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:58 AM
చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కార్పోరేట్ సంస్థలకు మేలు చేసే కార్యక్రమాలు తప్ప ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదని, ఇప్పుడు కూడా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో అదే పని చేస్తున్నారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. పేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో సీఎం శ్రీ వైయస్ జగన్, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి, వాటిలో ఏడింటిని పూర్తి చేశారని ఆయన గుర్తు చేశారు. 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా మొదలయ్యాయన్న ఆయన, వాటితో సహా మొత్తం 10 కొత్త మెడికల్ కాలేజీలను టీడీపీ కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించిందని, కోటి సంతకాల కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పారు. ఈనెల 18న గవర్నర్ను కలుస్తున్న శ్రీ వైయస్ జగన్, వాటన్నింటినీ సమర్పిస్తారని విజయనగరంలో మీడియాతో మాట్లాడిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
Latest News