|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:29 AM
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెల 19న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. జాతీయ అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.దేశవ్యాప్తంగా ఇప్పటికే 29 రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను బీజేపీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో యూపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ఈ వారాంతంలోనే పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పరిశీలకుడిగా వ్యవహరించనుండగా, ఆదివారం నాటికి కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ పదవికి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
Latest News