|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 07:18 PM
ఏపీలోని 974 కిలోమీటర్ల తీరప్రాంతంలో మోనజైట్, ఇల్మెనైట్, రూటిల్, జిర్కాన్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి విలువైన ఖనిజాలు భారీగా బయటపడ్డాయి. ఈ ఖనిజాలు దేశ రక్షణ, సెమీకండక్టర్ రంగాలలో కీలక మార్పులు తీసుకురావడంతో పాటు, తర్వాతి తరం న్యూక్లియర్ రియాక్టర్ల తయారీకి, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, శాటిలైట్ వ్యవస్థలు, ఆధునిక వైద్య పరికరాల తయారీకి ఉపయోగపడతాయి. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMDC) ఈ ఖనిజాలను వెలికితీసే పనిని ప్రారంభించింది.
Latest News