నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నాయకులతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్
 

by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:25 PM

కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన దాదాపు 3 వేల మందితో సమావేశం నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.నామినేటెడ్ పదవులు పొందిన వారితో పార్టీ అధినేత సోమవారం సమావేశం కానున్నారని ఆయన పేర్కొన్నారు. "పదవి - బాధ్యత" పేరుతో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమం గురించి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులతో నాదెండ్ల మనోహర్ నిన్న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, కార్యక్రమ వివరాలను వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ తరపున నిర్వహిస్తున్న "పదవి - బాధ్యత" కార్యక్రమం అత్యంత కీలకమైన సమావేశమని పేర్కొన్నారు.

Latest News
Bangladesh suicide rates surge in 2020-24, 40 people died daily Tue, Dec 23, 2025, 04:09 PM
EAM Jaishankar meets Lankan ministers, reiterates India's full support Tue, Dec 23, 2025, 04:04 PM
Resolving Delhi's inherited problems on all fronts: CM Rekha Gupta Tue, Dec 23, 2025, 03:55 PM
Free trade pact with New Zealand India's first women-led FTA: PM Modi Tue, Dec 23, 2025, 03:52 PM
CM Stalin writes to EAM after Sri Lankan Navy arrests 12 TN fishermen Tue, Dec 23, 2025, 03:47 PM