|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:34 PM
పల్నాడు జిల్లాలో మరోసారి నెత్తురు పారింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు వేట కొడవళ్లతో వారిని కిరాతకంగా నరికి చంపారు. మృతులను టీడీపీ కార్యకర్తలైన కొత్త హనుమంతరావు, కొత్త శ్రీరామమూర్తిగా పోలీసులు గుర్తించారు. ఈ జంట హత్యలతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వీరిపై ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడ్డారు. గ్రామ శివారులోని ఓ బండరాయి వద్ద హనుమంతరావు మృతదేహం లభించగా, నీలంపేట అమ్మవారి గుడి దగ్గర ఉన్న వాటర్ ప్లాంట్ సమీపంలో శ్రీరామమూర్తిని హతమార్చారు. ఇద్దరినీ అత్యంత పాశవికంగా వేట కొడవళ్లతో నరకడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Latest News