|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 07:58 PM
తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారం విచారించింది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న చెవిరెడ్డిని, కోర్టు అనుమతితో అధికారులు ప్రశ్నించారు.సోమవారం ఉదయం 11 గంటల సమయంలో జైలుకు చేరుకున్న సిట్ అధికారులు, మధ్యాహ్నం వరకు చెవిరెడ్డిని విచారించారు. కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయంలో ఆయన టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, అప్పట్లో నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఎందుకు మార్చారు ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారు అనే కోణంలో అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.ఈ కుంభకోణంలో భాగమైన వ్యక్తులతో జరిగిన చర్చలు, ఒప్పందాల మార్పునకు దారితీసిన పరిస్థితులపై అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. ఒకవైపు మద్యం కేసులో రిమాండ్లో ఉండగానే, మరోవైపు టీటీడీ కల్తీ నెయ్యి కేసులో విచారణ ఎదుర్కోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.
Latest News