|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:50 PM
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెనుమంట్ర మండలం పోలమూరు సమీపంలో బైక్ డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సహాయానికి పరుగులు తీశారు. తీవ్ర గాయాలతో పడిపోయిన యువకులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతులను సత్యనారాయణ, అంజిబాబు, రాజుగా గుర్తించారు. ముగ్గురూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. క్రిస్మస్ వేడుకలు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Latest News