|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 07:40 PM
అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్పై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్న వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగు మూలాలున్న భారతీయ అమెరికన్ అయిన ఉషా వాన్స్ను ఉద్దేశించి జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్న వారికి ఆయన ఘాటైన పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. తన భార్యపై దాడి చేసేది ఎవరైనా సరే, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన నిక్ ఫ్యూయెంటెస్ అనే ఫార్-రైట్ పాడ్కాస్టర్, గత కొంతకాలంగా ఉషా వాన్స్ను లక్ష్యంగా చేసుకుని జాత్యహంకార దూషణలకు పాల్పడుతున్నారు. ఆమె భారతీయ వారసత్వాన్ని కించపరిచేలా 'జీత్' వంటి అనుచిత పదాలను ఉపయోగిస్తూ, జేడీ వాన్స్ను 'జాతి ద్రోహి' అని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'అన్హర్డ్' అనే ఆన్లైన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. నా భార్యపై దాడి చేసేది మాజీ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి అయినా, నిక్ ఫ్యూయెంటెస్ అయినా సరే.. వాళ్లు నా నుంచి తీవ్రమైన ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వాన్స్ తీవ్ర పదజాలంతో అన్నారు. ఇది తన 'అధికారిక విధానం' అని ఆయన తేల్చిచెప్పారు. జాతి విద్వేషం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.యాంటీ-సెమిటిజ లేదా మరే ఇతర జాతి విద్వేషానికైనా కన్జర్వేటివ్ ఉద్యమంలో చోటు లేదు" అని ఆయన అన్నారు.ఉషా వాన్స్ కాలిఫోర్నియాలో తెలుగు వలస తల్లిదండ్రులకు జన్మించారు. ఆమె అమెరికా చరిత్రలోనే తొలి భారతీయ-అమెరికన్, తొలి హిందూ సెకండ్ లేడీగా నిలిచారు. 2024 ఎన్నికల ప్రచారం నుంచే ఆమె తన వారసత్వం కారణంగా పలుమార్లు ఆన్లైన్లో జాత్యహంకార దాడులను ఎదుర్కొన్నారు.
Latest News