|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 07:02 PM
AP: వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై మరోసారి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన పాపాల చిట్టాపై వరుసగా విచారణలు జరుగుతున్నాయని అన్నారు. తప్పు చేసిన వాళ్లెవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. గత సంవత్సరం మద్యం అక్రమాలతో మద్యం నామ సంవత్సరంగా మారిందని, వైసీపీ నాయకులు మద్యం ద్వారా విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఏడాది భూమి నామ సంవత్సరం కావొచ్చని మంత్రి సెటైర్లు వేశారు.
Latest News