ఓట్స్‌లో ఆపిల్, వేడినీటిలో నిమ్మరసం కలిపి తీసుకొంటే జరిగేది ఇదే
 

by Suryaa Desk | Fri, Jan 02, 2026, 10:12 PM

ఫుడ్ కాంబినేషన్ అనగానే.. ప్రతీ ఒక్కరికీ ఒక్కో టేస్ట్ ఉంటుంది. కొంతమందికి గులాబ్‌ జామూన్‌ని ఐస్‌క్రీమ్‌తో కలిపి తినడం ఇష్టం. మరికొంతమందికి పెరుగన్నంలో మామిడిపండు తినడం ఇష్టం. కొంతమందికి ఇవి ఇష్టం ఉండవు. అయితే, ఇష్టాలు వేరు. వాటిని తినడం వల్ల వచ్చే సమస్యలు వేరు. కొన్ని ఫుడ్స్‌ని మనం ఎప్పటికీ కలిపి తినకూడదు. ముఖ్యంగా, ఆయుర్వేదం ప్రకారం. దీని వల్ల చాలా సమస్యలొస్తాయి. అలా కలిపి తినకూడని ఫుడ్స్ ఏంటో చెబుతున్నారు ఆయుర్వేద డాక్టర్ వర.


అటుకులతో అరటిపండు


సాధారణంగా వీటి కాంబినేషన్ ఎక్కువగా ఉండదు. కానీ, అటుకులు తినగానే అరటిపండు తినడం, లేదా అరటిపండు తినగానే పోహా తినడం వంటివి అస్సలు మంచివి కావు. దీని వల్ల కడుపులో పెద్ద గందరగోళమే ఏర్పడుతుంది. దీంతో జీర్ణక్రియలో తేడా వచ్చి అగ్నిని గందరగోళానికి గురించి అమాని సృష్టిస్తాయి.


ఎలా తినాలి?


నిజానికీ, అరటిపండు, అటుకులు రెండు కూడా వేటికవే ప్రత్యేకం. రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని విడివిడిగా కాస్తా గ్యాప్ ఇచ్చి తినాలి. అరటిపండుని నానబెట్టిన సీడ్స్‌తో కలిపి తినొచ్చు. పోహాని ఇష్టంగా ఊరికే తినొచ్చు.


ఓట్స్‌లో ఆపిల్స్


సాధారణంగా పండ్లు అంతగా ఇష్టపడరు. కానీ, ఓట్స్‌తో కలిపితే మనకి తెలియకుండానే తినొచ్చు పైగా ఫైబర్ యాడ్ అవుతుందని చాలా మంది ఓట్స్‌లో ఆపిల్ కలిపి తింటారు. కానీ, ఇలా తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. త్వరగా జీర్ణమవ్వదు. పైగా ఉబ్బరం పెరుగుతుంది.


ఎలా తింటే మంచిదంటే


ఆపిల్‌ని నేరుగా తినాలి. లేదా సీడ్స్, స్పైసెస్‌తో కలిపి తినొచ్చు.


ఓట్స్‌ని కూడా విడిగానే తీసుకోవడం మంచిది. దీని వల్ల జీర్ణ సమస్యలు రావు. మీకు గనుక గట్ ప్రాబ్లమ్స్ లేకపోతే కలిపి తిన్నా ప్రాబ్లమ్ ఉండదు. ​


పెరుగుతో రాజ్మా


చాలా మంది రాజ్మా వండినప్పుడు అందులో పెరుగు వేయడం. లేదా పెరుగు తినగానే రాజ్మా తినడం, రాజ్మా తిన్న వెంటనే పెరుగు తినడం చేస్తారు. కానీ, కడుపులో ఓవర్‌లోడ్ అయిపోతుంది. అమాని పెంచుతుంది. అందుకే, అలా తినకుండా స్పైసెస్‌తో రాజ్మాని, లేదా అన్నం, మిల్లెట్స్‌తో రాజ్మాని తినడం మంచిది. పెరుగు కూడా అంతే. కానీ, రెండింటిని కలిపి తినొద్దు.


ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్స్


కిచిడితో దోసకాయ


కిచిడిలో కొంతమంది దోసకాయని పచ్చిగా తినడానికి ఇష్టపడతారు. కానీ, చల్లని దోసకాయ, కిచిడీతో తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలా కాకుండా దోసకాయని వేరుగా, కిచిడీని వేరుగా తినడం అలవాటు చేసుకోండి. దీని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.


వేడినీటితో తేనె, నిమ్మనీరు


చాలా మంది ఉదయాన్నే వేడినీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతారు. ఇది మంచిదే కానీ, వేడిగా ఉన్నప్పుడు రెండూ కూడా యాడ్ చేయొద్దు. దీని వల్ల అవి రియాక్షన్ జరిగి టాక్సిన్స్‌లా మారే అవకాశం ఉంది. అందుకే, గోరువెచ్చని నీటిలో మాత్రమే కలిపి తీసుకోవడం మంచిది. అప్పుడే ఆరోగ్యానికి మంచిది.


Latest News
Kohli, Kuldeep visit Shree Mahakaleshwar Temple, attend Bhasma Aarti Sat, Jan 17, 2026, 01:00 PM
Rahane pulls out of remaining Ranji Trophy matches Sat, Jan 17, 2026, 12:54 PM
US reports over 18 million flu cases for current season Sat, Jan 17, 2026, 12:52 PM
US Senators warn Afghan evacuee vetting gaps risk attacks Sat, Jan 17, 2026, 12:49 PM
Centre likely to roll out collateral‑free loans for gig workers, domestic helpers soon Sat, Jan 17, 2026, 12:38 PM