|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:03 AM
పంజాబ్లోని మురాద్పురాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లఖ్వీందర్ కౌర్ అనే వధువు తన పెళ్లికి 14 రోజుల ముందు స్నేహితురాలితో పారిపోయింది. సదరు యువతికి, సమీప గ్రామానికి చెందిన యువకుడితో జనవరి 14న పెళ్లి జరగాల్సి ఉంది. ఓ పక్క పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమె, సునీత అనే యువతితో పారిపోయింది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని, స్వలింగ వివాహం చేసుకుంటామని సునీత తెలిపింది. ఈ ఘటనపై వధువు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Latest News