|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 11:41 AM
AP: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయించానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం పనులు నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని పేర్కొంది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణలో అధికార, విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించింది. ఏపీ నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని తెలిపింది.
Latest News