|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:26 PM
వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత ఆ దేశ భవిష్యత్తుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగాఅయన మాట్లాడుతూ..... ప్రస్తుతం వెనిజువెలాను ఎవరు నడిపిస్తున్నారన్న ప్రశ్నకు "నేనే" అని ఒక్క మాటలో సమాధానమిచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ దేశంలో ఇప్పుడప్పుడే ఎన్నికలు ఉండవని, ముందుగా అక్కడి మౌలిక సదుపాయాలను బాగు చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.వచ్చే 30 రోజుల్లో వెనిజువెలాలో ఎన్నికలు జరుగుతాయా? అన్న ప్రశ్నకు ట్రంప్ ప్రతికూలంగా స్పందించారు. "ముందు దేశాన్ని ఒక దారికి తీసుకురావాలి. ప్రజలు ఓటు వేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. దేశ ఆరోగ్యాన్ని తిరిగి పుంజుకునేలా చూడడమే మా మొదటి ప్రాధాన్యం" అని ఆయన పేర్కొన్నారు.వెనిజువెలా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు రంగాన్ని పునర్నిర్మించేందుకు అమెరికా చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఈ ప్రక్రియకు 18 నెలల కంటే తక్కువ సమయం పడుతుందని ఆయన అంచనా వేశారు. "దీని కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ ఖర్చును చమురు కంపెనీలే భరిస్తాయి. ఆ తర్వాత వచ్చే ఆదాయం ద్వారా లేదా మా ద్వారా వారు ఆ సొమ్మును తిరిగి పొందుతారు" అని వివరించారు.తాము వెనిజువెలాతో యుద్ధం చేస్తున్నామన్న వాదనను ట్రంప్ తోసిపుచ్చారు. "మేము యుద్ధం చేస్తోంది వెనిజువెలాతో కాదు.. మా దేశంలోకి డ్రగ్స్ పంపుతున్న మాఫియాతో. తమ జైళ్లలోని ఖైదీలను, నేరస్తులను మా దేశంలోకి వదిలిపెట్టిన వారిపైనే మా పోరాటం" అని ఆయన స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఒకవేళ సహకారం అందకపోతే రెండోసారి సైనిక దాడి చేసేందుకు కూడా సిద్ధమని హెచ్చరించారు.
Latest News