'కోళ్లు, మేకలకు ప్రాణం ఉండదా? కేవలం కుక్కల కోసమేనా ఆవేదన?': సుప్రీం కోర్టు
 

by Suryaa Desk | Wed, Jan 07, 2026, 08:56 PM

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వీధి కుక్కల దాడుల సమస్యపై సుప్రీం కోర్టులో బుధవారం ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. జంతు ప్రేమికులు కేవలం కుక్కల గురించి మాత్రమే మాట్లాడుతుండటంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. "మనం కేవలం కుక్కల గురించే ఎందుకు చర్చిస్తున్నాం? కోళ్లు, మేకల పరిస్థితి ఏంటి? వాటికి ప్రాణాలు ఉండవా?" అని జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం నిలదీసింది.


కోర్టులో బాధితుల ఆవేదన


విచారణ సందర్భంగా వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 90 ఏళ్ల వృద్ధుడి ఫోటోను చూపించేందుకు ఒక పిటిషనర్ ప్రయత్నించగా.. కోర్టు దానిని సున్నితంగా తిరస్కరించింది. బాధితుల తరపు న్యాయవాదులు వాదిస్తూ.. వీధి కుక్కల వల్ల సామాన్యులు నరకం చూస్తున్నారని, కుక్కల హక్కుల కంటే మానవ హక్కులను కాపాడటం అత్యవసరమని పేర్కొన్నారు. జపాన్, అమెరికా వంటి దేశాల్లో కుక్కలను షెల్టర్లకు తరలించి, ఎవరూ దత్తత తీసుకోకపోతే వాటిని కారుణ్య మరణం ద్వారా చంపేస్తారని, అందుకే అక్కడ రేబిస్ మరణాలు లేవని కోర్టు దృష్టికి తీసుకోచ్చారు. నోయిడాలో కుక్కల దాడికి గురైన ఎనిమిదేళ్ల చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ కాలనీలను నో డాగ్ జోన్స్‌గా ప్రకటించే అధికారం ఇవ్వాలని కోరారు.


జంతు ప్రేమికుల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. తాము కేవలం కుక్కలనే కాకుండా పర్యావరణాన్ని కూడా ప్రేమిస్తామని చెప్పారు. "నేను కోడి మాంసం తినడం మానేశాను. ఎందుకంటే వాటిని పంజరాల్లో బంధించి, బలవంతంగా చంపి మాంసం అమ్మడమే కారణం" అని కోర్టు ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వీధి కుక్కల జనాభాను తగ్గించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న 'క్యాప్చర్, స్టెరిలైజ్, వ్యాక్సినేట్, రిలీజ్' (CSVR) పద్ధతి విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు. కుక్కలను పూర్తిగా షెల్టర్లలో ఉంచడం మున్సిపాలిటీలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని, చెత్త కుప్పలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలను తొలగిస్తేకోతుల బెడద పెరుగుతుందని విశ్లేషించారు.


సోలిసిటర్ జనరల్ ఘాటు స్పందన


ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నీ కేవలం కుక్క ప్రేమికుల చుట్టూనే తిరుగుతున్నాయని, జంతు ప్రేమికుల గురించి కాదని చురకలు అంటించారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో 90 శాతం మంది వద్దన్నా, 10 శాతం మంది కోసమే కుక్కలను ఉంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రేపు ఎవరైనా తమ ఇంట్లో ఆవును లేదా గేదెను కట్టేస్తామంటే ఒప్పుకుంటామా? అని నిలదీశారు.


ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం స్కూళ్లు, ఆసుపత్రులు, కోర్టుల వంటి సంస్థాగత ప్రాంతాల నుంచి కుక్కలను తొలగించాలనే తమ ఆదేశాలపై అభ్యంతరాలు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. కుక్క ప్రేమికులు, వ్యతిరేకులు ఇద్దరి వాదనలను ఓపికగా వింటామని కోర్టు స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణకు, ప్రజా రక్షణకు మధ్య సమతుల్యత సాధించే దిశగా సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి మరి.

Latest News
No better place than a full crowd of blue: Daryl Mitchell on NZ youngsters’ first cricket experience of India Sun, Jan 11, 2026, 06:30 PM
Amit Shah calls for BJP CM in Kerala, pushes big leap for party Sun, Jan 11, 2026, 06:27 PM
People of Punjab must reject politics of lies, says Haryana CM Sun, Jan 11, 2026, 06:25 PM
Pakistani police arrest Afghan journalist in Islamabad Sun, Jan 11, 2026, 05:31 PM
Pakistan needs to give fair taxation rights to states Sun, Jan 11, 2026, 05:30 PM