|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 08:34 PM
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా యంత్రాంగాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఉత్తర ద్వార దర్శనం కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు.డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు కల్పించిన ఉత్తర ద్వార దర్శనంలో మొత్తం 7.83 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని సీఎం తెలిపారు. దర్శనం చేసుకున్న వారిలో 97 శాతం మంది సామాన్య భక్తులే ఉండటం ఎంతో సంతోషకరమని, ఇది అభినందనీయమని పేర్కొన్నారు.క్యూలైన్ల పర్యవేక్షణ, అన్నప్రసాదం అందించడం నుంచి భక్తులకు కల్పించిన ప్రతి సౌకర్యంలోనూ యంత్రాంగం తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇచ్చాయని చంద్రబాబు కొనియాడారు. శ్రీవారి భక్తులు పూర్తి సంతృప్తి చెందేలా వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో, తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు భక్తులు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Latest News