రోహిత్ శర్మ.. జై షా మాటలకు హిట్‌మ్యాన్ రియాక్షన్ హైలెట్
 

by Suryaa Desk | Fri, Jan 09, 2026, 10:55 PM

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ రెండు ఐసీసీ ట్రోఫీలతో చరిత్రలో నిలిచిపోయాడు. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హిట్‌మ్యాన్‌ను వన్డే క్రికెట్ నుంచి కూడా తొలగించి, ఆ బాధ్యతలు గిల్‌కు అప్పగించారు. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా రోహిత్ శర్మను ఇండియన్ కెప్టెన్‌గా పరిచయం చేయడం ఆసక్తికరంగా మారింది.


ఈ కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ రోహిత్ శర్మను ఇండియా కెప్టెన్ అని చెప్పాడు.. దాంతో టీమిండియా స్టార్ బ్యాటర్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనూహ్యంగా వచ్చిన ఈ వ్యాఖ్యకు రోహిత్ ఇచ్చిన చిరునవ్వు, ఆశ్చర్యం కలిసిన స్పందన అభిమానులను బాగా ఆకట్టుకుంది.


అక్టోబర్ 2025లో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు, వన్డే ఫార్మాట్‌లో శుభ్‌మన్ గిల్‌ను భారత కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే, కెప్టెన్‌గా రోహిత్ సాధించిన విజయాలు మాత్రం భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. 38 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత్ వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్, 2025లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలవడంలో రోహిత్ నాయకత్వం కీలక పాత్ర పోషించింది.


డిసెంబర్ 2021లో రోహిత్ శర్మ భారత వన్డే జట్టు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని నాయకత్వంలో భారత్ మొత్తం 56 వన్డే మ్యాచ్‌లు ఆడగా, అందులో 42 విజయాలు, 12 ఓటములు, ఒక టై, ఒక నో రిజల్ట్ నమోదు అయ్యాయి. 2018లో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఆసియా కప్ గెలిచిన రోహిత్, 2023లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా మరోసారి ఆసియా కప్‌ను భారత్ ఖాతాలో వేశాడు. అలాగే, 2023 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరడంలోనూ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. అతని కెప్టెన్సీ ప్రయాణం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో మరింత గొప్పగా ముగిసింది.


టీ20 ఫార్మాట్‌లో అయితే రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా నిలిచాడు. 62 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 49 విజయాలు సాధించాడు. కనీసం 53 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న ఆటగాళ్లలో 79.03 శాతం విజయశాతంతో రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇక రోహిత్ శర్మ తదుపరి మ్యాచ్‌ల విషయానికి వస్తే, జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అతడు మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు.


Latest News
No better place than a full crowd of blue: Daryl Mitchell on NZ youngsters’ first cricket experience of India Sun, Jan 11, 2026, 06:30 PM
Amit Shah calls for BJP CM in Kerala, pushes big leap for party Sun, Jan 11, 2026, 06:27 PM
People of Punjab must reject politics of lies, says Haryana CM Sun, Jan 11, 2026, 06:25 PM
Pakistani police arrest Afghan journalist in Islamabad Sun, Jan 11, 2026, 05:31 PM
Pakistan needs to give fair taxation rights to states Sun, Jan 11, 2026, 05:30 PM