|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 11:06 PM
వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వేతన సవరణలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలు, నాబార్డ్ ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్ పెంపు ఉంటుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో 46,000 మందికిపైగా ఉద్యోగులు, 23,500 మందికిపైగా పెన్షనర్లు, 23 వేలకుపైగా ఫ్యామిలీ పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 6 పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 14 శాతం బేసిక్ పే పెరగనుంది. వీరికి ఈ వేతన సవరణ అనేది 2022, ఆగస్టు 1 నుంచే అమలులోకి రానుంది. అంటే అప్పటి నుంచి బకాయిలు చెల్లించనున్నారు.
'ప్రస్తుతం ఉన్న బేసిక్ పే, డియర్నెస్ అలవెన్సులపై 14 శాతం పెంపుతో వేతన సవరణ బిల్లులో మొత్తం పెరుగుదల 12.41 శాతంగా ఉంటుంది. ' అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేతన సవరణ ద్వారా 43,247 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. అలాగే 2010, ఏప్రిల్ 1వ తేదీ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కంట్రిబ్యూషన్ అనేది 10 శాతం నుంచి 14 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. మరోవైపు ఫ్యామిలీ పెన్షన్ అనేది అందరికీ సమానంగా 30 శాతం మేర పెంచినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. దీని ద్వారా 14,615 మందికి మేలు కలుగుతుందని తెలిపింది.
ఆరు పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీల్లోని ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్ పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వంపై అదనంగా రూ.8,170 కోట్ల భారం పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. బీమా కంపెనీల జాబితా ఓసారి పరిశీలిస్తే..
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ
న్యూ ఇండియా అష్యూరెన్స్
ఓరియంటల్ ఇన్సూరెన్స్
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ
నాబార్డ్ ఉద్యోగులకు 20 శాతం వేతన పెంపు
నాబార్డ్ లోని గ్రూప్ ఏ, బీ, సీ ఉద్యోగులకు వేతనాలు 20 శాతం పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ వేతనాల పెంపు 2022, నవంబర్ 1 నుంచి అమలలోకి వస్తుందని తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా 3,800 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారని తెలిపింది. నాబార్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణతో ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.170 కోట్ల భారం పడుతుందని, బకాయిల చెల్లింపుల కోసం రూ.510 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. నాబార్డ్ రిటైర్డ్ ఉద్యోగులు నేరుగా నియమితమై, నవంబర్ 2017 కి ముందు పదవీ విరమణ చేసిన వారి పెన్షన్లు ఇప్పుడు ఆర్బిఐ రిటైర్డ్ ఉద్యోగులతో సమానంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
ఆర్బీఐ పెన్షనర్లకు 10 శాతం హైక్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విధులు నిర్వర్తించి రిటైర్ అయిన వారికి వచ్చే పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ 10 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పెంపు సైతం 2022, నవంబర్ 1 నుంచే అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయంతో మొత్తం 30,769 మంది పెన్షనర్లు (22,580 మంది వ్యక్తిగత, 8,189 మంది ఫ్యామిలీ పెన్షనర్లు) లబ్ధి పొందుతారని తెలిపింది. బకాయిలు, వేతన పెంపు కారణంగా ప్రభుత్వం పై రూ.2696.82 కోట్ల భారం పడుతుందని
Latest News