|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 02:54 PM
ప్రస్తుతం భారతీయుల జీవితంలో క్రెడిట్ కార్డు కీలక పాత్ర పోషిస్తోంది. తాజా నివేదికల ప్రకారం గతేడాది ఫెస్టివ్ సీజన్లో క్రెడిట్ కార్డు వినియోగం భారీగా పెరిగింది. సుమారు 42 శాతం మంది యూజర్లు రూ.50,000కుపైగా షాపింగ్కు ఖర్చు చేశారు. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోతే సిబిల్ స్కోర్ తీవ్రంగా పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆటోమేటిక్ పేమెంట్స్, శాలరీ వచ్చిన వెంటనే బిల్లు చెల్లించడం, రిమైండర్లు పెట్టుకోవడం, గడువు ముందే పేమెంట్ చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో కనీసం మినిమమ్ డ్యూ అయినా చెల్లించాలి లేదా EMIగా మార్చుకోవడం మంచిదని చెబుతున్నారు.
Latest News