|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 10:25 PM
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మరో 12 కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి ( ఐపీఓ) ఆమోదం లభించింది. శుక్రవారం నాటి రెగ్యులేటరీ అప్డేట్ ద్వారా ఈ వివరాలు బహిర్గతమయ్యాయి. అంటే మరో 12 కంపెనీలు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఆయా సంస్థలు గత సంవత్సరం 2025 జూన్ నుంచి అక్టోబర్ మధ్య ముసాయిదా పత్రాలు సమర్పించాయి. వాటిని పరిశీలించిన సెబీ ఈ నెల 19 నుంచి 23వ తేదీల మధ్య అబ్జర్వేషన్ లెటర్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో 12 కంపెనీల ఐపీఓలకు ఆమోదం లభించినట్లయింది. మరి ఆ 12 కంపెనీల గురించిన వివరాలు తెలుసుకుందాం.
ఐపీఓలకు ఆమోదం పొందిన కంపెనీలు ఇవే
హెల్లా ఇన్ఫ్రా మార్కెట్
పర్పుల్ స్టైల్ ల్యాబ్స్
జయ్ జగదాంబ లిమిటెడ్
యూకేబీ ఎలక్ట్రానిక్స్
సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్
ట్రాన్స్లైన్ టెక్నాలజీస్
మెడిక్యాప్ హెల్త్ కేర్
ఓస్వాల్ కేబుల్స్
బీవీజీ ఇండియా
సాయి పేరెంటరల్స్
కాంమ్టెల్ నెట్వర్క్స్
సిఫి ఇన్ఫినిట్ స్పేసెస్
ఇన్ఫ్రా.మార్కెట్ సంస్థలు మాతృ సంస్థ అయిన హెల్లా ఇన్ఫ్రా మార్కెట్ మార్కెట్ నుంచి రూ.4500 నుంచి రూ.5500 వరకు సమీకరించాలనే లక్ష్యంతో ఐపీఓకు ముసాయిదా పత్రాలను సమర్పించింది. గతేడాది 2025, అక్టోబర్ నెలలో సెబీ రహస్య ప్రీఫైలింగ్ మార్గం ద్వారా డాక్యుమెంట్లు అందించింది. ఈ కంపెనీ ఫ్రెష్ షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్ హోల్డర్ల వాటా విక్రయం సైతం ఉండనుందని తెలుస్తోంది.
సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ ల్యాబ్స్ అనేది సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ. ఈ సంస్థ మార్కెట్ల నుంచి రూ.2500 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. ఇక పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ కంపెనీ లగ్జరీ ఫ్యాషన్ ప్లాట్ఫారమ్ పెర్నియాస్ పాప్ అప్ షాప్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ రూ.660 కోట్లు సమీకరించేందుకు ఐపీఓకు వస్తోంది. ట్రాన్స్లైన్ టెక్నాలజీస్ రూ.1.62 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అందుబాటులోకి తెస్తోంది. యూకేబీ ఎలక్ట్రానిక్స్ సంస్థ రూ.400 కోట్లు సమీకరించేందుకు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వాటా విక్రయించేందుకు ఐపీఓకు వస్తోంది.
ఇక నాన్ ఫెర్రస్ మెటల్ రిసైక్లింగ్ చేసే సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటేట్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 4.28 కోట్ల ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా అందుబాటులోకి తెస్తోంది. ఓస్వాల్ ల్యాబ్స్ రూ.300 కోట్లు సమీకరించేందుకు ఫ్రెష్ ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. 2.22 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది. బీవీజీ ఇండియా సైతం ఆఫర్ ఫర్ సేల్, ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఐపీఓకు వస్తోంది. కాంమ్టెల్ నెట్వర్క్స్ రూ.900 కోట్లు సమీకరించేందుకు ఐపీఓకు వస్తోంది. అయితే, మెయిన్ బోర్డ్ నుంచి వచ్చే కంపెనీలపైనే రిటైల్ ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News