|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 08:33 AM
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా అభిమానులకు భారీ షాక్ ఇచ్చాడు. సుమారు 274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా మాయమైంది. ఇవాళ ఉదయం నుంచి ఆయన ప్రొఫైల్ కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురవుతున్నారు.కోహ్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన వారికి ఈ పేజీ అందుబాటులో లేదు లేదా లింక్ బ్రోకెన్ అయి ఉండవచ్చు అనే ఎర్రర్ మెసేజ్లు కనిపిస్తున్నాయి. ఇటీవలే న్యూజిలాండ్పై అద్భుతమైన సెంచరీతో వన్డే ర్యాంకింగ్స్లో తిరిగి నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుని మంచి ఫామ్లో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, కోహ్లీ ఎక్స్ ఖాతా మాత్రం యాక్టివ్గానే ఉంది. కోహ్లీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అభిమానులంతా ఆయన భార్య, నటి అనుష్క శర్మ సోషల్ మీడియా ఖాతాలపై దృష్టి సారించారు.కోహ్లీకి ఏమైంది అంటూ ఆమె తాజా పోస్టుల కింద వేలల్లో కామెంట్లు పెడుతున్నారు. అయితే, అనుష్క కూడా ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.అధికారిక ప్రకటన ఏదీ లేకపోవడంతో నెట్టింట రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది సాంకేతిక లోపమా లేక కోహ్లీనే స్వయంగా సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ఇచ్చారాఅనే దానిపై స్పష్టత లేదు. కొందరు నెటిజన్లు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న నిహలిస్ట్ పెంగ్విన్మీమ్తో దీన్ని పోలుస్తూ, కోహ్లీ డిజిటల్ ప్రపంచం నుంచి విరామం తీసుకున్నారని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ఇన్స్టాగ్రామ్లో ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా కోహ్లీకి గుర్తింపు ఉంది. ఆయన అకౌంట్ మాయమవడం స్పోర్ట్స్-సోషల్ మీడియా ప్రపంచంలో ఒక పెద్ద లోటును సృష్టించింది. ప్రస్తుతం అభిమానులంతా కోహ్లీ ఎక్స్ ఖాతా నుంచి గానీ, అనుష్క నుంచి గానీ ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Latest News