|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 01:59 PM
ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సోమవారం అసెంబ్లీకి వీల్చైర్లో వచ్చారు. ఎడమ కాలి బొటనవేలుపై గాయం కారణంగా ఆయన నడవలేని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో ఆయన వీల్చైర్లో వచ్చారు. "గోరు ఊడిపోయింది.. ఇలాంటివి కొన్ని సార్లు జరుగుతుంటాయి" అని ఆయన వ్యాఖ్యనించారు. ఆయన ఇటీవల ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సంగతి తెలిసిందే.ఇటీవలే తేజస్వి యాదవ్కు ప్రమోషన్ దక్కింది. ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అలాగే సోదరుడు తేజ్ ప్రతాప్ కూడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో ఇద్దరూ కలిశారు. గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరంగా ఓడిపోయింది.
Latest News