|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:12 PM
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్, తన మాజీ భర్తను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. ఒక టాక్ షోలో తాను చేసిన వ్యాఖ్యలు ఏళ్ల తరబడి అణచిపెట్టుకున్న భావోద్వేగాల ఫలితమేనని, పురుష సమాజాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆమె కోరారు.ఇటీవల 'ఆప్ కీ అదాలత్' అనే కార్యక్రమంలో మేరీ కోమ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తన మాజీ భర్త కె. ఓన్లెర్ కోమ్ గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో "ఏక్ రూపియా భీ నహీ కమాయా" (ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు) అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలు పురుషులను అవమానించేలా ఉన్నాయని, ఫుట్బాల్ క్రీడాకారుల కష్టాన్ని తక్కువ చేసేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వివాదంపై మేరీ కోమ్ తాజాగా వివరణ ఇచ్చారు. "చాలా ఏళ్లుగా అణచిపెట్టుకున్న బాధ, నిరాశ, ద్రోహానికి గురయ్యాననే భావన ఒక్కసారిగా బయటకు రావడంతోనే ఆ క్షణంలో అలా మాట్లాడాను. నా వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుష సమాజం మొత్తాన్ని ఉద్దేశించినవి కావు. ఆ వ్యాఖ్యల వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా పురుష సమాజానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను" అని ఆమె పేర్కొన్నారు.
Latest News