నువ్వు ఒక్క ట్వీట్ అయినా పెట్టావా.. నాగబాబు
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:08 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు విమర్శలు గుప్పించారు. వివిధ అంశాల మీద స్పందిస్తూ నాగబాబు సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేశారు. తాను సనాతన హిందువును అని చెప్పిన నాగబాబు.. తన ధర్మాన్ని గౌరవిస్తూ, ఇతరులను గౌరవించకుండా బతుకుతున్నానని అన్నారు. తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు. కల్తీ నెయ్యి విషయం గురించి మళ్లీ మాట్లాడతానని అన్నారు.


"నేను సగటు భారతీయుణ్ని, హిందువును, నాస్తికుడిని కాదు. ఆదిశంకరుల అద్వైతం, రమణ మహర్షుల ఆత్మజ్ఞానం.. ఇద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైన పరమాత్మను నమ్ముతా. హిందూ అనేది నమ్మకమో, మతమో కాదు.. ఓ జియోగ్రాఫికల్ ఐడెంటిటీ. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకూ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. నేను నిఖార్సైన హిందువును. నా ధర్మా్న్ని గౌరవిస్తూ , ఇతరులను కించపరచకగుండా బతుకుతున్న ప్రౌడ్ సనాతన హిందువును. ఎమ్మెల్సీగా మాట్లాడే అవకాశం రాగానే అర్చకుల చాలీచాలని జీతాల గురించి మాట్లాడా. "


అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైతే.. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి అప్పటి వైసీపీ సర్కారు కేసును సీబీఐకు అప్పగిస్తామని చెప్పింది. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకుంటే అసలు ఈ కేసును టేకప్ చేయలేదని సీబీఐ చెప్పింది. వైసీపీ దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా.. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసమైతే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కేసును నీరుగార్చారు. మీకూ, మీ నేతలకు రిలీజ్ సినిమాలకు రివ్యూలివ్వటం తప్పితే రాముడి గురించి ఎందుకు" అని నాగబాబు ప్రశ్నించారు.


"అయోధ్యలోఎన్నో ఏళ్ల తర్వాత రామాలయం నిర్మాణం పూర్తి అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి దర్శించుకున్నారు. వైసీపీ నాయకుడు కనీసం ఒక ట్వీట్ అయినా, వీడియో బైట్ అయినా పెట్టారా. అసలు దీనిపై మీ స్టాండ్ ఏమిటో చెప్పారా. ఆ దమ్ముందా.. మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు..అభినందించే సంస్కారం లేదు. తిరుమల శ్రీవారిని ఏడాదికి ఒకసారైనా దర్శించుకోవాలనేది హిందువుల కల. నెల నెలా డబ్బులు కూడపెట్టుకుని తిరుమలకు వెళ్తుంటారు. అలాంటిది వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండ మీద వసతి ఛార్జీలు భారీగా పెంచారు. ఐదు వందలకు దొరికే రూములను వేయి, 1500లకు పెంచారు. దర్శనాలు, సేవలు ఇంకా దారుణం. "


మరోవైపు తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ ఎమ్మెల్సీ నాగబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు.. తన కూతురుకు డిక్లరేషన్ ఇప్పించారని నాగబాబు గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లారన్ననాగబాబు .. వైఎస్ జగన్ కలాం కంటే గొప్ప వ్యక్తా అని ప్రశ్నించారు. డిక్లరేషన్ అడిగారనే కారణంతో తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న చరిత్ర వైఎస్ జగన్‌ది అంటూ నాగబాబు మండిపడ్డారు. కల్తీ నెయ్యి గురించి తర్వాత మాట్లాడతానంటూ వీడియో విడుదల చేశారు.

Latest News
Summit should establish India as leading AI player globally: NITI Aayog’s Anna Roy Tue, Feb 17, 2026, 12:19 PM
US, Philippines reaffirm defence pact Tue, Feb 17, 2026, 12:15 PM
PM Modi, French Prez Macron to meet today in Mumbai Tue, Feb 17, 2026, 12:08 PM
Beyond the gun: Security forces move to erase Maoist ideology Tue, Feb 17, 2026, 12:02 PM
Bolivia's Vice President arrives in India to attend AI Impact Summit Tue, Feb 17, 2026, 11:50 AM