జ్వరం వచ్చినప్పుడు ఎందుకు ఏం తినాలనిపించదు
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 10:18 PM

సాధారణంగా వాతావరణం మారినప్పుడో లేదా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడో మనకు జ్వరం రావడం సహజం. జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడెక్కడంతో పాటు మనలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఏమీ తినాలని అనిపించకపోవడం, నోరంతా చేదుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. దీనిపై ప్రముఖ పీడియాట్రిక్ నిపుణులు డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అసలు విషయం చెప్పుకొచ్చారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చుద్దాం.


తినాలని ఎందుకు అనిపించదు?


​జ్వరం వచ్చినప్పుడు ఎంత ఇష్టమైన పదార్థం ఎదురుగా ఉన్నా తినబుద్ధి కాదు. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉందని డాక్టర్ చెప్పారు. మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రవేశించినప్పుడు దానిపై పోరాడటానికి మన రోగనిరోధక వ్యవస్థ సిద్ధమవుతుంది. ఈ పోరాట క్రమంలో మన రోగనిరోధక వ్యవస్థ 'సైటోకైన్స్' అనే కొన్ని ప్రత్యేక రసాయనాల్ని విడుదల చేస్తుంది.


ఈ సైటోకైన్స్ నేరుగా మెదడులోని 'అపెటైట్ సెంటర్' (ఆకలిని నియంత్రించే కేంద్రం) మీద ప్రభావం చూపుతాయి. దీనివల్ల మెదడు ఆకలి సంకేతాలను పంపడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఫలితంగా మనకు ఆహారం తీసుకోవాలనే కోరిక కలగదు. నిజానికి ఇది శరీరం తన శక్తిని జీర్ణక్రియకు కాకుండా ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి మళ్ళించే ఒక సహజ మార్గం.


నోరు ఎందుకు చేదుగా ఉంటుంది?


​చాలా మంది జ్వరం వచ్చినప్పుడు నోరంతా పాచి పట్టినట్లు ఉన్నట్లు, రుచి తెలియనట్లు ఉందని చెబుతుంటారు. ఇన్ఫెక్షన్ సమయంలో రక్తంలో కొన్ని రకాల విష పదార్థాలు ఏర్పడతాయి. ఇవి మన లాలాజలం సహజ రుచిని మార్చివేస్తాయి. అదేవిధంగా నాలుకపై ఉండే రుచి మొగ్గలు (టేస్ట్ బడ్స్) పనితీరు కూడా ఈ సమయంలో మందగిస్తుంది. జ్వరం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గి నోరు ఆరిపోవడం వల్ల కూడా రుచి లేనట్టు, చేదుగా అనిపిస్తుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు జరిగే ఒక సహజ ప్రక్రియ మాత్రమే.


చికెన్ తింటే కామెర్లు వస్తాయా?


చికెన్ తింటే కామెర్లు వస్తాయా?


మన సమాజంలో ఉన్న అతిపెద్ద అపోహల్లో జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే కామెర్లు వస్తాయని నమ్మడం ఒకటి. జ్వరం వచ్చినప్పుడు కామెర్లు వస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనని డాక్టర్ స్పష్టం చేశారు. చికెన్ తినడం వల్ల కామెర్లు రావని తేల్చి చెప్పారు. వాస్తవానికి జ్వరం ఉన్నప్పుడు శరీరంలోని జీర్ణ వ్యవస్థ కాస్త బలహీనంగా ఉంటుంది.


చికెన్ వంటి మాంసాహారాల్లో ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల అవి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అరుగుదల సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే పాత కాలం నుండి చికెన్ వద్దని చెబుతుంటారు. ఒకవేళ ఎవరికైనా జ్వరం సమయంలో చికెన్ తినాలనిపిస్తే, ముక్కల కంటే చికెన్ సూప్ తీసుకోవడం చాలా ఉత్తమమని డాక్టర్ వెల్లడించారు.


త్వరగా కోలుకోవడానికి ఏం తినాలి?


జ్వరంతో నీరసించిన శరీరం త్వరగా కోలుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. జీర్ణక్రియకు భారం కలగకుండా ఉండే తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు రికవరీని వేగవంతం చేస్తాయి.


​ద్రవ పదార్థాలు: నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కోసం ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు తీసుకోవడం మంచిది.


వేడి పదార్థాలు: వెచ్చని వెజిటెబుల్ సూప్స్ లేదా చికెన్ సూప్స్ తాగడం వల్ల గొంతుకు హాయిగా ఉండటమే కాక శరీరానికి తగినంత హైడ్రేషన్ లభిస్తుంది.


ఆహారం: కిచిడి, పెరుగన్నం వంటివి జీర్ణం కావడానికి సులభంగా ఉంటాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ కడుపుకు మేలు చేస్తాయి.


పండ్లు: అరటి పండు, ఆపిల్స్ వంటి పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిలోని విటమిన్లు ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి తోడ్పడతాయి.


చివరగా ఏం తెలుసుకోవాలి?


రోగికి ఆకలి లేకపోయినా కొద్దికొద్దిగా ఆహారం అందించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ అందించిన ఈ సూచనలు పాటించడం వల్ల జ్వరం బారి నుండి సులభంగా కోలుకోవచ్చు. ఆహారం విషయంలో భయపడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడమే ఆరోగ్యానికి అసలైన సూత్రం.


Latest News
PM Modi calls on Israel President, discusses ways to enhance cooperation in key sectors Thu, Feb 26, 2026, 03:34 PM
ECI gives details of Bengal deployment of 240 CAPF companies in first phase on March 1 Thu, Feb 26, 2026, 03:34 PM
'No space for invaders as heroes': CM Fadnavis on Shivaji Maharaj-Tipu Sultan comparison Thu, Feb 26, 2026, 03:21 PM
Pune Porsche case: SC issues notice on bail plea of minor's father Thu, Feb 26, 2026, 03:17 PM
Pakistan: Section 144 imposed in South Waziristan due to rising security concerns Thu, Feb 26, 2026, 03:12 PM