'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ప్రచురణపై స్పందించిన ఎంఎం నరవణె
 

by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:12 PM

తన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ప్రచురణపై భారత సైన్యం మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె మౌనం వీడారు. తన పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. నా పుస్తక ప్రచురణ ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉందంటూ ఆయన 'ఎక్స్' వేదికగా 'పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా' చేసిన పోస్టును పేర్కొన్నారు.ఈ పుస్తకం కాపీలు ఇంకా ప్రింట్ కాలేదని, డిజిటల్ రూపంలో కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని, కాబట్టి ఈ కాపీలు ఎవరికీ ఇవ్వలేదని, విక్రయించలేదని ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా పోస్టు చేసింది. దీనిని ఆయన రీపోస్టు చేస్తూ పైవిధంగా స్పందించారు. ఈ పుస్తకం ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదని పెంగ్విన్ ప్రకటన చేసింది.నరవణే రాసిన పుస్తకంపై పార్లమెంటులో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. చైనా భారత భూభాగంలోకి వచ్చిందని ఈ పుస్తకం వెల్లడిస్తోందని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

Latest News
IPL 2026: When and where to watch SRH vs CSK, know all details Fri, Apr 17, 2026, 04:48 PM
Top Nifty stocks at 17th percentile valuations despite $12.7 bn FII selling: Report Fri, Apr 17, 2026, 04:46 PM
India, Cyprus discuss bilateral ties and institutional cooperation Fri, Apr 17, 2026, 04:44 PM
Women Oppn MPs disapprove 'linking' of Women's Reservation and Delimitation Bills Fri, Apr 17, 2026, 04:43 PM
Baloch group claims attack on Pakistani military camp, highway blockade Fri, Apr 17, 2026, 04:42 PM