పరిశుభ్రతకు సహకరిస్తే.. ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ ఉచితం!
 

by Suryaa Desk | Fri, Feb 13, 2026, 07:21 PM

జాతీయ రహదారులపై ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, పరిశుభ్రత అందించే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. టోల్ ప్లాజాల వద్ద మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఎవరైనా మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉంటే, దాని ఫోటోను రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా జియో-ట్యాగ్ చేసి, పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) & మొబైల్ నంబర్‌తో సహా అప్‌లోడ్ చేయాలి. సమాచారం నిజమని తేలితే, ఫోటో షేర్ చేసిన వారికి రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి ప్రజల సహకారం NHAI కోరుతోంది.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM