|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 02:25 PM
గాజాలో ప్రస్తుత కాల్పుల విరమణ మొదటి దశ పూర్తయిందని ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ గై నిర్ తెలిపారు. బందీలందరూ తిరిగి వచ్చినట్లు వివరించారు. హమాస్ ఆయుధాలను విడిచిపెట్టడం రెండో దశ లక్ష్యమని పేర్కొన్నారు. గాజాలో పౌర భవనాల కూల్చివేతపై ప్రశ్నించగా, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రవేశించినప్పుడు ప్రతి రెండవ ఇల్లు బాంబులతో నిండి ఉందని, హమాస్ సొరంగాలు, బాంబులను కనుగొందని వివరించారు. మానవతా సహాయాన్ని అడ్డుకుంటున్నామన్న ఆరోపణలను ఖండించి, హమాస్ సహాయాన్ని దోచుకుంటుందని ఆరోపించారు.
Latest News