|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 03:34 PM
ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిల్లాంగ్కు బయలుదేరాల్సిన విమానంలో టాయిలెట్లో చేతిరాతతో ఉన్న బెదిరింపు స్లిప్ను సిబ్బంది గుర్తించారు. కాగా, విమానంలోకి ప్రయాణికులు ఎక్కిన తర్వాత బాంబు ఉన్నట్లు చేతితో రాసి ఉన్న బెదిరింపు స్లిప్ను టాయిలెట్లో సిబ్బంది గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ విమానాన్ని వెంటనే ఐసోలేషన్ బే వద్దకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులను ఖాళీ చేయించారు. భద్రతా నిబంధనల మేరకు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసినట్లు ఇండిగో పేర్కొంది. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి, ప్రయాణికులను ఖాళీ చేయించారు. భద్రతా నిబంధనల మేరకు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు ఇండిగో వెల్లడించింది.
Latest News