|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 04:19 PM
దాదాపు రెండు దశాబ్దాలుగా సంచలనం రేపుతున్న ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రీ-పోస్టుమార్టం నిమిత్తం సీబీఐ అధికారులు సేకరించిన ఆమె శరీర అవశేషాలను శుక్రవారం (27వ తేదీ) తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. విజయవాడ సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు తెనాలిలోని ఖబర్స్తాన్లో అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటలోపు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీబీఐ అధికారులు గుంటూరు ఎస్పీని కోరారు. మరోవైపు, 19 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న ఆయేషా తల్లిదండ్రులకు మద్దతుగా న్యాయవాదులు, విద్యార్థి, మహిళా సంఘాలు 'చలో తెనాలి' కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. విజయవాడ నుంచి పెద్ద ఎత్తున తెనాలికి తరలిరానున్నారు.ఈ సందర్భంగా ఆయేషా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా మాట్లాడుతూ.. తమ కుమార్తె కేసులో సీబీఐ సహా అన్ని దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యాలను తారుమారు చేసిన అధికారులపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు.
Latest News