|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 02:03 PM
రంజాన్ నెలలో ఉపవాసం పాటించే వారికి దాహం, అలసట, బలహీనత ప్రధాన సవాళ్లుగా మారతాయి. సెహ్రీలో నెమ్మదిగా జీర్ణమయ్యే, శక్తినిచ్చే ఓట్స్, గుడ్లు, పాలు వంటివి తీసుకోవాలి. ఇఫ్తార్లో ఒక్కసారిగా నీరు తాగకుండా, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటివి తీసుకోవాలి. ఖర్జూరాలతో ఉపవాసం విరమించి, వేయించిన పదార్థాలకు బదులు సలాడ్లు, పండ్లు తీసుకోవాలి. ఇఫ్తార్ నుంచి సెహ్రీ వరకు తగినంత నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సరైన ఆహార పద్ధతులతో ఉపవాసాన్ని ఆరోగ్యకరంగా కొనసాగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News