|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 07:51 PM
అనకాపల్లిలోని కన్యాకా పరమేశ్వరి ఆలయానికి చెందిన వంద కోట్ల విలువైన 2.49 ఎకరాల దేవాదాయ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేలా జిల్లా కలెక్టర్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. శుక్రవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. 111 ఏళ్ల క్రితం బ్రాహ్మణ సత్రం కోసం దానమిచ్చిన ఈ భూమిపై కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు నివేదిక ఇచ్చారని అమర్నాథ్ మండిపడ్డారు.
Latest News