సమయం వచ్చే వరకు రాజీనామాకు గల కారణాలు గోప్యంగా ఉంటాయన్న బోస్
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 08:59 PM

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా 1200 రోజులు సేవలందించానని, క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే 12 సెంచరీలు చేశానని గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆనందబోస్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఆకస్మికంగా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా వ్యవహారంపై ఆయన స్పందిస్తూ, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రాజీనామాకు గల కారణాలను సరైన సమయం వచ్చే వరకు గోప్యంగా ఉంటాయని అన్నారు.కోల్‌కతా విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు తిరిగి బెంగాల్‌కు వస్తానని తెలిపారు. ప్రవేశం ఉన్నచోట నిష్క్రమణ కూడా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 1200 రోజులు గవర్నర్‌గా సేవలు అందించడం తనకు చాలునని అన్నారు. నిష్క్రమించడానికి ఇది సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎదురైన చేదుఘటనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, రాష్ట్రపతి ఎంతో అనుభవజ్ఞురాలని, గౌరవప్రదమైన వ్యక్తి అన్నారు. ఆమె అలా మాట్లాడటానికి కారణాలు ఏమైనా ఉండవచ్చని అన్నారు. రాష్ట్రపతి చేసిన కామెంట్లపై తాను ఎలాంటి వ్యాఖ్య చేయబోనని అన్నారు. కేరళకు చెందిన ఆనందబోస్ తన రాజీనామాకు వారం రోజుల ముందు తన ఓటు హక్కును బెంగాల్‌కు మార్చుకున్నారని తెలుస్తోంది.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM