మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన
 

by Suryaa Desk | Sun, Mar 15, 2026, 08:25 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి కేవలం గంట ముందు, 2008 నుంచి పేరుకుపోయిన కరవు భత్యం బకాయిలను చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలిపారు.మా ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, లక్షలాది మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఆర్ఓపీఏ 2009 డీఏ బకాయిలను 2026 మార్చి నుంచే అందుకోవడం ప్రారంభిస్తారు అని తన ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో పంచాయతీలు, మున్సిపల్ సంస్థల ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరనుంది.2008 నుంచి 2019 మధ్య కాలానికి చెందిన డీఏ బకాయిలలో 25 శాతాన్ని మార్చి 31 నాటికి చెల్లించాలని ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ ఉండేలా చూడాలని, బకాయిలను దశలవారీగా చెల్లించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం సూచించింది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, బకాయిలు చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఈ నెలలో 'పని నిలిపివేత' నిరసన కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్‌కు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ముందు మమత సర్కార్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Latest News
6,000 PNG consumers give up LPG connections to help others Sun, Mar 29, 2026, 04:40 PM
IPL 2026: Mumbai Indians set to become first team to play 300 matches Sun, Mar 29, 2026, 04:32 PM
PM Modi says Kerala is ready for change; targets LDF and UDF Sun, Mar 29, 2026, 04:30 PM
One killed, 10 injured as mini-bus strikes motorists in Eastern Afghanistan Sun, Mar 29, 2026, 04:27 PM
Sri Lankan President Dissanayake expresses gratitude to India for swift fuel support Sun, Mar 29, 2026, 03:54 PM