IPOకి అదనపు సమయం.. సెప్టెంబర్ వరకు కొత్త డెడ్‌లైన్
 

by Suryaa Desk | Wed, Apr 08, 2026, 10:59 PM

భారత క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ Securities and Exchange Board of India తాజాగా పబ్లిక్ ఇష్యూలు (IPOs)తో పాటు, పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌కు సంబంధించిన గడువులను పొడిగించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ముగియాల్సిన ఐపీవో అనుమతుల గడువును ఇప్పుడు 2026 సెప్టెంబర్ 30 వరకు విస్తరించింది.అదే విధంగా, పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటాను కల్పించాల్సిన నిబంధనల అమలుపైనా సంస్థ సడలింపు ఇచ్చింది. ఈ నిబంధనను పాటించాల్సిన కంపెనీలకు కూడా 2026 సెప్టెంబర్ 30 వరకు అదనపు గడువు లభించింది. ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి సెబీ వేర్వేరు సర్క్యులర్‌లు విడుదల చేసింది.దీంతో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ నిబంధనలను అమలు చేయాల్సిన లిస్టెడ్ కంపెనీలకు కొంత ఊరట లభించింది. మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీలకు ఉపయోగకరంగా మారనుంది.ఇక గతంలో COVID-19 సమయంలో కూడా సెబీ ఇలాంటి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ భయాలు, మార్కెట్‌లో ఉన్న అనిశ్చితి నేపథ్యంలో ఈసారి కూడా గడువు పెంపు నిర్ణయం తీసుకుంది.

Latest News
IPL 2026: When and where to watch SRH vs CSK, know all details Fri, Apr 17, 2026, 04:48 PM
Top Nifty stocks at 17th percentile valuations despite $12.7 bn FII selling: Report Fri, Apr 17, 2026, 04:46 PM
India, Cyprus discuss bilateral ties and institutional cooperation Fri, Apr 17, 2026, 04:44 PM
Women Oppn MPs disapprove 'linking' of Women's Reservation and Delimitation Bills Fri, Apr 17, 2026, 04:43 PM
Baloch group claims attack on Pakistani military camp, highway blockade Fri, Apr 17, 2026, 04:42 PM