|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 12:23 PM
AP: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తయింది. ఫిబ్రవరి 20న ఏర్పాటు చేసిన ఈ కమిషన్ తిరుమలలో పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి, నెయ్యి కొనుగోలు విధానంపై సమగ్రంగా దర్యాప్తు చేసింది. నిపుణుల కమిటీ సభ్యుడు విజయభాస్కర్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. ఈ నెల 30న కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. దీంతో ఈ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Latest News