|
|
by Suryaa Desk | Wed, Apr 29, 2026, 11:54 AM
వేసవిలో మార్కెట్లోకి వచ్చే మామిడి పండ్లను కొనేముందు జాగ్రత్త వహించాలి. లాభాపేక్షతో కొందరు వ్యాపారులు కార్బైడ్ వంటి రసాయనాలతో పండ్లను మగ్గబెడుతున్నారు. సహజంగా పండిన పండ్లు అక్కడక్కడా పసుపు, ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో, మంచి సువాసనతో, మెత్తగా ఉంటాయి. రసాయనాలతో పండించినవి నిగనిగలాడుతూ, అంతా ఒకే పసుపు రంగులో, గట్టిగా ఉంటాయి. నీటిలో వేస్తే సహజ పండ్లు మునిగిపోతాయి, రసాయనాలతో పండించినవి తేలుతాయి. కల్తీ పండ్లు తింటే నాలుకపై మంట, గొంతులో అసౌకర్యం, కడుపునొప్పి, వాంతులు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రుచి కంటే ఆరోగ్యాన్నే ప్రాధాన్యత ఇవ్వాలి.
Latest News